ఎమ్మెల్యే యాదయ్య కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఎంతవరకు సమంజసం: కాంగ్రెస్ యూత్ లీడర్ మోత్కుపల్లి మహిపాల్ యాదవ్

Spread the love

శంకర్‌పల్లి: ఫిబ్రవరి 27: ( సాక్షిత న్యూస్): చేవెళ్ల ప్రస్తుత ఎమ్మెల్యే కాలే యాదయ్య 2014 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తీసుకొని గెలిచి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని శంకర్‌పల్లి మండల కొండకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మోత్కుపల్లి మహిపాల్ యాదవ్ ప్రశ్నించారు? మంగళవారం విలేకరులతో మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే యాదయ్య శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన చైర్మన్, కౌన్సిలర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే.


బిఆర్ఎస్ పార్టీ నుండి కొంత మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం విధితమే. కౌన్సిలర్ల పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఎమ్మెల్యే యాదయ్య అనడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు. ఎమ్మెల్యే యాదయ్య కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లయితే, ఇప్పుడు కౌన్సిలర్లు కూడా
బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేవారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే యాదయ్య ప్రెస్ మీట్ లు పెట్టి కౌన్సిలర్లు రాజీనామా చేయడం అనేది సిగ్గుచేటని మోత్కుపల్లి మహిపాల్ యాదవ్ తెలిపారు.

Related Posts

You cannot copy content of this page