నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ – ఎమ్మెల్యే ఆర్కే

Spread the love

దుగ్గిరాల మార్కెట్ యార్డ్ లో నాలుగో విడత వైయస్సార్ చేయూత నగదు మంజూరు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే, ఇంచార్జి మురుగుడు లావణ్య , మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ :

పేదవాడిని ధనవంతుడిగా చేయడం కోసం పేదవారి తలరాతను మార్చడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు.

వైయస్ఆర్ నాలుగవ విడత చేయూత ద్వారా దుగ్గిరాల మండలంలోని అక్కా చెల్లెమ్మలకు సుమారు ఏడు కోట్లు రూపాయలు అందజేయడం జరిగిందన్నారు.

ఇచ్చిన వాగ్దానాలను నూరు శాతం అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ సామాజిక సమానత్వం కోసం, ఆర్థిక అసమానతలు రూపుమాపడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తు చేశారు .

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలవాలని, మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థినిగా మురుగుడు లావణ్య కి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అనంతరం వైయస్సార్ చేయూత నాలుగో విడత నగదు చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, జడ్పిటిసి సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో భార్గవి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page