జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

Spread the love

Chief Secretary to State Government video conference with District Collectors

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొనవల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైద్రాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జి.ఓ నెం.58, 59 పై ప్రభుత్వ ప్రధాన కార్యదిర్శ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జి.ఓ నెం.58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లాలో అందిన దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు.


వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంధ్రనాద్, సూర్యనారాయణ, కలెక్టరేట్ ఏ.ఓ మదన్ గోపాల్, ఖమ్మం అర్బన్ తహశీల్దారు శైలజ, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page