ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి మహబూబాబాద్ జిల్లా పర్యటన విజయవంతం

Spread the love

Chief Minister KCR’s visit to Mahabubabad district yesterday was a success

మహబూబాబాద్ జిల్లా మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి మహబూబాబాద్ జిల్లా పర్యటన విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.

సీఎం కేసీఆర్ నిన్నటి సభలో మహబూబాబాద్ జిల్లాకు వరాల జల్లు కురిపించారు.

మహబూబాబాద్ మున్సిపల్ ఆభివృధ్ధికి 50 కోట్లు
మిగిలిన మూడు మున్సిపల్ కార్యాలయాలు డోర్నకల్. మరిపెడ..తొర్రూరు 25 కోట్లు చొప్పున సీఎం కేసిఆర్ మంజారు చేశారు.

మహబూబాబాద్ జిల్లాలో అన్ని సౌకర్యాలతో కూడిన రెసిడెన్షియల్ ఇంజినీరింగ్ కళాశాల మంజూరు ఇవ్వడం ఎంతో సంతోషకరం.

మహబూబాబాద్ జిల్లాలో బాలికల కోసం కేజీ టూ పీజీ గురుకుల పాఠశాల ప్రారంభించుకోబోతున్నాం.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి మహబూబాబా జిల్లా ప్రజలు రుణపడి ఉంటారు.

ఈనెల 18వ తేదీన ఖమ్మం జిల్లాలో జరగబోయే బీ.ఆర్.ఎస్ భారీ బహిరంగ సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలి.

మహబూబాబాద్ జిల్లా నుండి లక్ష 20వేల మంది సభకు హాజరవుతారు.

రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం
రేపు 10 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం సభ జన సమీకరణ పై ప్రజా ప్రతినిధుల సమావేశం ఉంటుంది.

బయ్యారం ఉక్కపరిశ్రమ కోసం కేంద్రం ప్రభుత్వం కృషి చేయాలి.

బయ్యారం ఉక్కు పరిశ్రమ మంజూరు చేయకపోతే ఈ ప్రాంతంలో బీజేపీ నాయకులకు ఓట్ల అడిగే హక్క లేదు.
……………………
మీడియా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు జిల్లా జడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోత్ బిందు, బీఆర్ ఎస్ రాష్ట ప్ర‌ధాన కార్య‌దర్శి నూక‌ల న‌రేష్ రెడ్డి, కురవి జడ్పిటిసి బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుగులోత్ శ్రీరామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page