ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి దివ్యాంగులతో పాటు కార్పొరేటర్ పాలాభిషేకం

Spread the love

సాక్షిత : కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఆధ్వర్యంలో అల్లాపూర్ డివిజన్ దివ్యాంగుల అధ్యక్షులు అమీర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి దివ్యాంగులతో పాటు కార్పొరేటర్ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా దివ్యాంగులకు రు 4116 రూపాయలు పెన్షన్ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో సంతోషిదాయకం అని అన్నారు,

అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 3000 పింఛన్ అందిస్తున్న ఘనత కూడా బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, కో ఆర్డినేటర్ వీరారెడ్డి, KKP BC సెల్ అధ్యక్షులు నాగుల సత్యం, ఎస్సీ సెల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్, మైనార్టీ సెల్ అధ్యక్షులు నూర్ ఖాన్, మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, చాంద్ సాబ్, కరీమ్ ఇస్మాయిల్, మల్లికార్జున్, అబ్దుల్ రజాక్, ఎల్లం, అగతముడి రమేష్, రవీందర్ రెడ్డి, తులసి రామ్, బాలయ్య, కమల్ వాసన్, రక్తపు సుధాకర్, యోగి రాజు, అశోక్, అమ్ములు, ఉమారాణి, రేవతి, శమ, సత్యవేణి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page