సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ కృషి..

Spread the love

BRS Sarkar’s efforts for the welfare of senior citizens..

సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ కృషి…

గుర్తింపు కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని రంగారెడ్డి నగర్ 127 డివిజన్ కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ తో కలిసి సీనియర్ సిటిజన్స్ కు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కు గుర్తింపు కార్డులు పంపిణీ చేయడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కార్ సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వాలు ఏనాడు సీనియర్ సిటిజన్స్ ను గుర్తించలేదని, కానీ ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అందరి సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంగ లక్ష్మారెడ్డి, సీనియర్ నాయకుడు మహ్మద్ మక్సూద్ అలీ, కాలనీ వాసులు డేగ కృష్ణ మూర్తి, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, శంకర్ గౌడ్, సుధాకర్, వార్డు సభ్యురాలు మేహరున్నిస్సా బేగం, శ్రీనివాస్, భాస్కర్, బాలు నేత తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page