భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

Spread the love

భూపాలపల్లి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు …

……..

సాక్షిత భూపాలపల్లి జిల్లా
: భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రెడ్డి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మరియు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి & పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మరియు సహచర శాసనసభ్యులు పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్వినిరెడ్డి, తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* . అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బిజెపి మతపరమైన రాజకీయం చేస్తుందని రాముని పేరు చెప్పి ఓట్లు రాముని పేరు చెప్పి ఓట్లు దండుకుంటామని ముందుకు వస్తున్నారు రాముడు ఒక బీజేపీ పార్టీకే సొంతం కాదు మనందరికీ దేవుడు అని తెలియజేస్తూ రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్ లో మీరు ఎలా అయితే పాలకుర్తి నియోజకవర్గం లో గండ్ర సత్యనారాయణ రావు ని అత్యధిక మెజార్టీ తో గెలిపించారో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది మరింత నిధులు తీసుకొని వస్తుంది కాబట్టి మన వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే తెలియజేశారు… ఈ సన్నాహక సమావేశంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాశ్ రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామిరెడ్డి, కత్తి వెంకటస్వామి, సునీత-ఆనంద్, గాజర్ల అశోక్, పార్లమెంట్ నియోజకవర్గంలోని రాష్ట్ర , జిల్లా, మండల, గ్రామ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page