వరద సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కలిసిన బస్తీ వాసులు…

Spread the love
Basti residents met the MLA to take action on the flood problem...

వరద సమస్యపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కలిసిన బస్తీ వాసులు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని రొడా మేస్త్రి నగర్ – ఏకు చెందిన బస్తీ వాసులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిన్న కురిసిన భారీ వర్షానికి వరద నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సమస్య పరిష్కారానికి నాలా వెడల్పు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ని కోరారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వరద సమస్య లేకుండా నాలా వెడల్పు పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మక్సుద్ అలీ, వార్డు మెంబర్ వహీద్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page