అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన శ్రీమతి భవాని కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రంను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి బాధిత కుటుంబానికి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF LOC – వివరాలు

1.మియాపూర్ డివిజన్ పరిధిలోని MA నగర్ కి చెందిన శ్రీమతి భవాని కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- ఒక లక్ష యాబై వేల రూపాయలు.

మొత్తం 1,50,000 /- ఒక లక్ష యాబై రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు,బ్రిక్ శ్రీనివాస్, కోనేరు ప్రసాద్, కాశినాథ్ యాదవ్,గుమ్మడి శ్రీనివాస్, ఎల్లం నాయుడు, మల్లేష్, మున్నా , కరణ్ సింగ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page