చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం

Spread the love

Annadanam to Ayyappa Swamy at Choudammagutta Sri Anjaneya Swamy Temple

చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం*
నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన గురుబ్రహ్మ శ్రీ శ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి
మొదటిరోజు అన్నదానం చేసిన 6వ వార్డ్ కౌన్సిలర్ లతాశ్రీ శ్రీశైలం గౌడ్*


రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి*

షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ఆవరణలో 6వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి లతాశ్రీ శ్రీశైలం గౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేశారు.

అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణలో అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ప్రారంభోత్సవానికి గురుబ్రహ్మ శ్రీశ్రీశ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ అన్నదాన కార్యక్రమం పూజలో కౌన్సిలర్ లతా శ్రీ శ్రీశైలం గౌడ్ దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు రఘుపతిరావు పంతులు నిర్వహించిన ప్రత్యేక పూజలో సతీషన్ నాయర్ గురుస్వామి పాల్గొన్నారు.

నుంచి జనవరి 5వ తారీఖు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. 2015 నుంచి చౌడమ్మగుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య గురుస్వామి, మున్సిపల్ మాజీ చైర్మన్ అగనూరు విశ్వం, కౌన్సిలర్లు ఈశ్వర్ రాజు, చింటూ ప్రతాపరెడ్డి స్వామి, రెటికల్ నందీశ్వర్ స్వామి, అయ్యప్ప సేవా సమితి సభ్యులు బాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభులింగం, రాజు, పినపాక ప్రభాకర్, నక్కల వెంకటేష్ గౌడ్, బాలరాజ్ యాదవ్, సతీష్, రఘు గౌడ్, లక్ష్మయ్య, బీరయ్య, అయ్యప్ప స్వాములు భక్తులు

Related Posts

You cannot copy content of this page