పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు

Spread the love

పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు
ఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల ఎంపిక

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మొదటి విడత డ్రా లో 500 మంది లబ్దిదారుల ఎంపిక*

అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు

అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కొంగరకలాన్ లో మొదటి విడతలో నియోజక వర్గానికి 500 చొప్పున జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ఎల్బీనగర్ మహేశ్వరం నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 2000 మందికి రాష్ట్ర విద్య శాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం , ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ , అంజయ్య యాదవ్ గార్ల తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మానస పుత్రిక పథకాలలో ఒకటి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం అని అన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టి పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి, ఆత్మగౌరవంతో గొప్పగా జీవించాలనే ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు వివరించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంతో పారదర్శకంగా అర్హులైన 500 మంది లబ్దిదారులకు కేటాయించడం జరిగినది, ఆత్మ ప్రతీక అని , ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని , పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు దశల వారిగా అందచేయడం జరుగుతుంది అని ,లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందచేయడం జరుగుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అర్హులైన నిజమైన లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా ,పారదర్శకంగా ఉండేలా చూసి నిజమైన లబ్ధిదారులకు అవకాశం కలిపించి ఇండ్లు కెటయించేలా చేయడం జరిగినది అని, అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామని, ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.

శేర్లింగంపల్లి- ‌2910 ,
రాజేంద్రనగర్ – 4166, ఎల్బీనగర్ – 4752, మహేశ్వరం-651, మొత్తం 12479 దరఖాస్తులను పరిశీలించి మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 500 మంది చొప్పున 2 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన వారికి విడతల వారిగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల
కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. పేదవారు ఆత్మ గౌరవంతో బ్రతకాలనే ఉద్దేశ్యంతో ఇళ్ళు కట్టించడం జరిగిందని మంత్రి తెలిపారు. మానవ ప్రయత్నంతో లాటరీ ద్వారా కేటాయింపు చేసే ప్రక్రియ కన్నా ఇది ఎన్నో రేట్లు నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని సూచిస్తుందని ఈ ప్రక్రియ ఇండియాలో మొదటి సారిగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవే కాకుండా స్థలం ఉన్న వారు గృహలక్ష్మి పథకం ద్వారా 3 లక్షలు రూపాయలు పొంది ఇండ్లు నిర్మించుకొనుటకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పారదర్శకంగా జరగాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్.ఐ.సి సహకారంతో ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఈ కేటాయింపులో ఎవరి జోక్యం లేకుండా ఈ సాఫ్ట్ వేర్ నిబద్దతతో కూడిన ప్రక్రియగా భావించ వచ్చని అన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా తక్కువ సమయంలోనే లబ్ది దారుల ఎంపిక ఈ సాఫ్ట్ వేర్ ద్వారా జరిగిందన్నారు.

Related Posts

You cannot copy content of this page