కొవిడ్ నేపథ్యంలో మూడేళ్ల విరామం తర్వాత ఇవాళ తిరిగి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది

Spread the love

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం ఇప్పటికే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2019లో ఆఖరి సారి చేప ప్రసాదం పంపిణీ చేయగా.. కొవిడ్ నేఫథ్యంలో గత మూడేళ్లుగా పంపిణీ నిలిచిపోయింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజున ఉబ్బసం, ఆయాసం వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి బత్తిని సోదరులు ఉచితంగా ఈ చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. దశాబ్దాలుగా సాగుతున్న ఈ కార్యక్రమం గురించి తెలుసుకుని ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, దిల్లీ వంటి అనేక ప్రాంతాల నుంచి రెండు రోజుల ముందుగానే వ్యాధిగ్రస్తులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​కి చేరుకున్నారు. చేప ప్రసాదం తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు.

Related Posts

You cannot copy content of this page