వైఎస్సార్సీపీలో చేరిన అచ్చంపేట టీడీపీ నాయకులు, కార్యకర్తలు

Spread the love

కండువా కప్పి ఆహ్వానించిన పెదకూరపాడు నియోజకవర్గ యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి .

అచ్చంపేట మండలంలో వైఎస్సార్సీపీకి రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమం.. ఎంతోమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. అచ్చంపేటలో టీడీపీకి చెందిన 30 కుటుంబాల వారికి పెదకూరపాడు నియోజకవర్గం యువ నాయకుడు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి గారు స్వయంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నంబూరు కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం పేదలకు అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందిస్తుందన్నారు. ప్రతిపక్షాలు కలలో కూడా ఊహించలేని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలో చేశామన్నారు. మరోసారి నంబూరు శంకరరావు ని గెలిపిస్తే పెదకూరపాడు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానన్నారు. వచ్చే ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్సీపీ జెండా ఎగరేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో నాగుల్, హయద్ , పెద్దన్న, పెద్ద హయద్ , గడ్డి నాగులు, బాలసైదా, సుభాని, మౌలాలి, సుభాని( కత్తి), ఖాజా నాగుల్, షేక్ యాసిన్, ఫటాన్ గాలిషా, నూర్ భాషా, నూర్ సైదా వలి, షేక్ సుభాని, షేక్ బాషా, షేక్ జాన్ సైదా, కుంటిమద్ది సుభాని, ముద్దపప్పు నాగులు, షేక్ నాగులు, సుభాని, జున్ను బుడే, మెమ్మసా , షేక్ ఇమాంవలి (రిక్షా), షేక్ బాజీ తదితరులున్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page