చిత్యలలో మంత్రి కేటీఆర్ కి ఘన స్వాగతం

Spread the love

ఎమ్మెల్యే చిరుమర్తి అద్వర్యంలో ఘన స్వాగతం
మంత్రి కేటీఆర్ ని సన్మానించిన ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల సాక్షిత ప్రతినిధి

పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కి
చిట్యాల లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లా లో పోడు భూముల పట్టాల పంపిణీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభించి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళుతూ మార్గమధ్యంలో చిట్యాల వద్ద కాసేపు ఆగిన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కి నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మున్సిపాలిటి చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి నార్కట్పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, రామన్నపేట ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి,రామన్నపేట బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మందడి ఉదయ్ రెడ్డి, చిట్యాల మండల పార్టీ కార్యదర్శి మల్లారెడ్డి, నాయకులు కొలను వెంకటేష్ గౌడ్, వనమా వెంకటేశ్వర్లు, పొన్నం లక్ష్మయ్య, జిట్టా చంద్రకాంత్, కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page