వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి

Spread the love

గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురుంచి మాట్లాడడం జరిగింది.

తక్షణమే వారికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంథని నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, అధికారులు, మా పోలీస్ మిత్రులంతా అండగా ఉంటారని ప్రజలందరికి దైర్యం చెప్పడం జరిగింది. వరదల్లో చిక్కుకున్న వరద బాధితులను కాటారం DSP రాంమోహన్ రెడ్డి మరియు CI రంజిత్ రావు తో కలిసి గ్రామంలో ఉన్న యువకుల సహకారంతో,పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page