పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.

Spread the love

74th Indian Republic Day Celebrations at the Parade Ground.

పరేడ్ మైదానంలో ఘనంగా జరిగిన 74 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు.
సాక్షిత కర్నూలు జిల్లా ప్రతినిధి

జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం చేశారు.

జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ జాతీయ జెండా కు గౌరవ వందనం చేశారు. పరిశీలన వాహనం పై నుండి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శాలువాలతో సత్కరించారు.ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల సిబ్బందికి జిల్లా కలెక్టర్,

జిల్లా ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బార్గవ్ తేజ్, సెబీ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ ఐపియస్ ,జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ లు ప్రసాద్, నాగబాబు , డిఆర్ఓ నాగేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page