స్థానికులకే 50 శాతం డబల్ బెడ్ రూమ్లు కేటాయించాలి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి

Spread the love

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో బిజెపి నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పటాన్చెరువు నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూములను స్థానికులకే కేటాయించాలని ఆమె డిమాండ్ చేశారు. స్థానికంగా పేద రైతులు భూముల కోల్పోవడం జరిగిందని ఈ నియోజకవర్గంలో లక్షల్లో డబుల్ బెడ్ రూమ్ కు అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం 2000 మాత్రమే ఇస్తానడం సిగ్గుచేటు అని అన్నారు. అనంతరం ధర్నా నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు పాదయాత్రగా వెళ్లి ఎమ్మార్వో ఆఫీస్ లో బిజెపి పార్టీ తరఫున డిటి శ్రీనివాస్ కి మెమోరాండం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ , మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ , పటాన్చెరు నియోజకవర్గ కన్వీనర్ కొలుకూరు రాజశేఖర్ రెడ్డి , శ్రీనివాస్ గుప్తా , వివిధ మండలాల కౌన్సిలర్లు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page