ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం.

Spread the love

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవి­ర్భావ దినోత్సవాన్ని యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు తో కలిసి యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ బాబు గారు పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశలు ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి పని చేయడంతో పాటు నైతిక విలువలతో కూడిన పాలన అందిస్తు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

అనంతరం 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ, యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్, రాష్ట్ర ఎస్టీ విభాగం సెక్రటరీ బద్దు నాయక్, మండల యూత్ ప్రెసిడెంట్ బజారు సాయి, పట్టణ కౌన్సిలర్ నూకల సాంబ, దుర్గగుడి డైరెక్టర్ అల్లూరి భాస్కర్, నాయకులు సలాది సూరిబాబు, చారుగుండ్ల కొండ, బాలకోటి, మెట్టు ఏడుకొండలు, గెల్లా పూర్ణచంద్రరావు, తూమాటి నాగేశ్వరరావు, దేవరకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page