సాక్షిత : కర్నూలు జిల్లా పత్తికొండ చెరువు ను వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయకట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్భాషపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన పత్తికొండ చెరువు చాలా పురాతనమైన చెరువు అని చాలా గ్రామాలకు త్రాగు, సాగునీరుకు భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడే చెరువు అన్నారు. వైసిపి పార్టీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గత నాలుగు సంవత్సరాలుగా చెరువులు నింపుతామని చెబుతున్నారు కానీ నింపిందే లేదు కానీ వైసీపీ వాళ్ళ పార్టీ నాయకులు చెరువును కబ్జా చేసేందుకు మొదలుపెట్టారు. అధికార పార్టీకి చెందిన సాబ్దిన్ నూర్ భాషా గద్దలు వాలినట్టు వాలి చెరువులు కుంటలు కబ్జాలు చేస్తున్నారని అన్నారు అధికారులు వైసిపి వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తూ కబ్జాకు సహకరిస్తున్నారు చెరువుకు సంబంధించి సాబ్దిన్ నూర్ భాషా చెరువు తూములను, కడుగొమ్ములను కబ్జా చేసి ఆరు అడుగుల మేర మట్టి వేసి పూడ్చి వేశాడు. ఇతడు ఆక్రమణలు చేసి కబ్జా చేస్తూ అధికారుల ద్వారా పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతనిపై చర్యలు తీసుకోకపోతే అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రజలు రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అధికారులను హెచ్చరించారు ఇప్పటికైనా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి స్పందించి చెరువును కబ్జా చేసిన సాబ్దిన్ నూర్ భాషా పై చర్యలు తీసుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారుల సహాయంతో చెరువును కబ్జా చేసి రాత్రికి రాత్రి తుములను కడుగోమ్మలను పూడ్చి వేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. అనంతరం ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
Home
Andhrapradesh
పత్తికొండ లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా చెరువు కబ్జా పై ధర్నా.
Related Posts
Spread the love వైసీపీలో చేరిన రూరల్ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద…
Spread the love పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్కి…
Spread the love కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు…
కారంపూడిలో మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభరాణి ఇంటింటి ఎన్నికల ప్రచారం
Spread the love షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిమాచర్ల నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభారాణి నియోజకవర్గ పరిధిలోని కారంపూడిలో ఇంటింట ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ముందుగా కారంపూడి…
Spread the love పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం.…
Spread the love టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా…
Spread the love గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598…
Spread the love తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల…
Spread the love ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల…
Spread the love మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు…