పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా

Spread the love

పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా కబ్జా

సాక్షిత కర్నూలు జిల్లా పత్తికొండ

కర్నూలు జిల్లా పత్తికొండ చెరువును వైసీపీ నాయకుడు కబ్జా చేసిన ఘటనపై స్థానిక ఆయికట్టు రైతులు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పత్తికొండ నాలుగు స్తంభాల కూడలిలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కబ్జా చేసినటువంటి వైసీపీ నాయకుడు సాబ్దిన్ నూర్ భాషా పై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన పత్తికొండ చెరువు చాలా పురాతనమైనదని చాలా గ్రామాలకు త్రాగు సాగు నీరుకు భూగర్భ జలాలు పెరిగేందుకు ఉపయోగపడే చెరువు అన్నారు. వైసిపి పార్టీకి చెందిన పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గత నాలుగు సంవత్సరాలుగా చెరువు నింపుతామని చెప్తున్నప్పటికీ కానీ నింపింది లేదు కానీ వైసీపీ వాళ్ల పార్టీ నాయకులు చెరువును కబ్జా చేసేందుకు మొదలుపెట్టారు అధికార పార్టీకి చెందిన సాబ్ది నూరు భాష గద్దలు వాటిలినట్లు వాలి చెరువును గుంటలు కబ్జాలు చేస్తున్నారని అన్నారు. అధికారుల ద్వారా పట్టాలు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని వారు వాపోయారు. ఇతనిపై స్థానిక అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని టిడిపి నాయకులు అఖిలపక్ష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆర్డీవోకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page