SAKSHITHA NEWS

Works of sewerage pipe line connecting to Setwin Colony

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెట్విన్ కాలనీ నందు ప్రశాంత్ నగర్ కాలనీ నుండి సెట్విన్ కాలనీ లోకి కలిపే సీవరేజ్ పైప్ లైన్ పనులను GHMC అధికారులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రశాంత్ నగర్ కాలనీ లో సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది అని, అలానే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అదే విదంగా పనులలో జాప్యం లేకుండా, త్వరితగతిన సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, వర్క్ ఇన్స్పెక్టర్ మరియు కాంట్రాక్టర్కు తగు సూచనలు చేసిన నార్నె శ్రీనివాసరావు . ఈ కార్యక్రమంలో GHMC వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ప్రభాకర్ రెడ్డి వేంకటేశ్వర రావు, వినయ్, అప్పిరెడ్డి, సాయి బాబు, మాధవ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS