ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్
ప్రజాస్వామ్య పరిరక్షణకు పౌరసంఘాలు ఐక్యంగా ఉండి పోరాడాలని డాక్టర్ గోపీనాథ్ అన్నారు. ఖమ్మం వైరా రోడ్ లోని సితార హోటల్ లోని ముహమ్మద్ ఇల్యాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా సన్నాహక సమావేశంలో డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతు భారతదేశం పేరుకు మాత్రమే ప్రజాస్వామ్య దేశంగా ఉందని నేటి పాలకులు ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్న బీజేపీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలన్నారు.

ఆనంతరం వివిధ పౌరసంఘాల బాధ్యులు ప్రసంగించారు. సమావేశం ఆనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ గోపీనాథ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ బివి రాఘవలు, లాయర్ తిరుమలరావు, లెక్చరర్ అర్ జీవన్ కుమార్, కొప్పుల నాగమని, ప్రధాన కార్యదర్శిగా సాధిక్ అహ్మద్, సెక్రటరీగా డాక్టర్ చిన్ని కృష్ణారావు, జాయింట్ సెక్రటరీగా వెంకటేశ్వరరావు, కోశాధికారిగా అబ్దుల్ ముజీబ్ ను ఎన్నుకున్నారు. ఈ సమావేశం లో విజయ్, రమేష్, కారల్ మార్క్స్ రాంబాబు, మౌలానా అబ్దుల్ ఘని, జైనుల్ పాషా, అనిల్ కుమార్, బిషఫ్ లాసేర్, లాయర్ సాదిక్, బద్రు నాయక్, అబ్దుల్ సమి, లక్ష్మి నారాయణ, అబ్దుల్ మలిక్, అబ్రార్,అబ్దుల్ రహేమన్, గణేష్, నాగా మణి , సుశీల, హుస్సేన్ బీ, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page