గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం

Spread the love

గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి


సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 20వ తేదీ ఆదివారం రోజున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ వంశీధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ తమ వంతుగా పేదవారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని ఈ వైద్య శిబిరానికి గుండె సంబంధిత వైద్యులు ఎముకల కీళ్ల వైద్యులు జనరల్ సర్జన్ చిన్నపిల్లల వైద్యులు ఈ వైద్య శిబిరంలో పాల్గొంటారు.

ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చే వారందరికీ ఉచితంగా టెస్టులు నిర్వహించి మరియు ఉచితంగా మందులు ఇవ్వబడును ప్రజలందరూ గమనించి ఉచిత వైద్య శిబిరంలో పాల్గొని సద్వినియోగం చేసుకోగలరని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యారంగం వైద్యరంగం పలు సామాజిక రంగాలలో గత పది సంవత్సరాలుగా సేవలందించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రజలందరి సహకారం ఈకార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో కంకణాల నరసింహారెడ్డి గొట్టమిట్ట ఉపసర్పంచ్ శేఖర్ కోన వేణి బాలకృష్ణ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page