యువకులంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలి: టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Spread the love

శంకర్‌పల్లి: యువకులంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండని టిపిసిసి జనరల్ సెక్రటరీ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధుసూదన్ రెడ్డిని శంకర్‌పల్లి మండలానికి చెందిన యువ నాయకులు సొసైటీ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని ఆయన నివాసంలో ఆయనకు బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని కోరారు. యువత రాజకీయాల్లోకి రావాలని, వారి చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. మధుసూదన్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ శ్రీకాంత్, మహారాజ్ పేట ప్రధానోపాధ్యాయులు తాహెర్ అలీ ఉన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page