పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్

Spread the love

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏ లు మరియు పిఆర్ సి డిఏ, ఎరియర్స్ సత్వరమే అందజేయాలని కోరారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ మాట్లాడుతూ 2004 తర్వాత సిపిఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్ లేకుండా పోయింది. కాబట్టి సిపిఎస్ ను తొలగించి ఓల్డ్ పెన్షన్స్ స్కీమ్ ను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా పాఠశాలలో సమస్యలను త్వరగా తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా టిఆర్టిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె రామచంద్ర, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page