బౌరంపేట్ లోని 17వ వార్డులో రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధి బౌరంపెట్ లోని 17వ వార్డులోని పెద్దచెరువు కట్ట మైసమ్మ ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు రూ.24 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సి.సి రోడ్డు మరియు రు.6 లక్షల వ్యయంతో నూతన నిర్మిస్తున్న స్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్లు పీసరి బాలమని కృష్ణా రెడ్డి మరియు నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తామన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు.

నిర్మిస్తున్న పనులలో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ గారికి సూచించారు… ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, పల్పనూరి దర్శన్ రెడ్డి, ధర్మ రెడ్డి, పల్పానూరి విష్ణు వర్ధన్ రెడ్డి, సత్తి రెడ్డి, నాయకులు మన్నే బల్ రాజు, ఆకుల యాదయ్య, గోనె మల్లారెడ్డి, సాయి క్రిష్ణ, శ్రీకాంత్ చింటు, కిట్టు, శంకర్, సత్యనారాయణ, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు….*

Related Posts

You cannot copy content of this page