జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు

Spread the love

జిఏచ్ఎంసి ఎంటమాలజీ ఔట్ సోర్సింగ్ ఉద్యుగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ మరియు గాజులరామారం జంట సర్కిల్లోని ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలని పరిష్కరించేందుకు. ఎమ్మెల్యే కె పి వివేకానంద ని చింతల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులని సొంత బిడ్డల్లా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నారన్న సంగతిని గుర్తు చేశారు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగుల కృషిని గుర్తించి రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలను పెంచి వారి గౌరవానికి తగిన గుర్తింపుని ఇచ్చారని అన్నారు కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎంటమాలజీ శాఖ ఉద్యోగుల సేవలు మరువలేనివని ఈ సందర్బంగా ఎమ్మెల్యే గుర్తుచేశారు , కెసిఅర్ కూడా ప్రజల కష్ట సుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి అని మీ ఈ సమస్యను త్వరలోనే సంబంధిత పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page