మేయర్ ఆధ్వర్యంలో 27వ డివిజన్ గడప గడప మన ప్రభుత్వ

Spread the love

మేయర్ శిరీష ఆధ్వర్యంలో 27వ డివిజన్ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం

*
ప్రజా ప్రతినిధులతో, అధికారులతో గడప గడపకు విశేష స్పందన*

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం పెద్ద సంఖ్యలో హాజరై బ్రహ్మరథం పట్టారు

సాక్షిత : తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక తాతయ్య గుంట ఆర్చి వద్ద నుండి ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం నిర్వహించారు.

ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గడప గడపకు పర్యటిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలన్నింటినీ మూడేళ్లలోపే నెరవేర్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు.

ప్రజల జీవితాల్లో జగనన్న సంక్షేమ పథకాలు వెలుగులు నింపుతున్నాయన్నారు.

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఇంటింటికీ వెళ్తున్న తమకు ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తోందన్నారు.

మళ్లీ జగనన్నకు ఓట్లు వేసి, మరో సారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు చెబుతున్నారని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, నగర మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్,ముద్ర నారాయణ, అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌలేశ్వర రెడ్డి, నగరపాలక కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page