నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Spread the love

హైదరాబాద్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది..

ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఆ బిల్లుపై చర్చ ఆలస్యం కావడంతో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాల ఉదయం 10 గంటలకు సభలో కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రాన్ని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విడుదల చేయనున్నారు..

నీటిపారుదల రంగంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాగునీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాలే విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత పదేళ్లలో సాగునీరు అందించకుండా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేందుకే ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని ఆరోపిస్తోంది. ఈ అంశాలతో పాటు కాళేశ్వరం లిఫ్టు పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడం వంటి అంశాలను శ్వేతపత్రంలో పొందుపరిచిన విషయం తెలిసిందే..

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page