SAKSHITHA NEWS

Sunkireddy Raghavender Reddy who started the water treatment center at BC Gurukul School.

బిసి గురుకుల పాఠశాలలో నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచినీటి శుద్ధి కేంద్రం (వాటర్ ప్లాంట్)న్ని ప్రారంభించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

కల్వకుర్తి పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాలలో 1,50,000 రూపాయలతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.విద్యార్థులకు దాహం తీర్చడానికి నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు.


కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ తిరుపతి, ప్రిన్సిపాల్ సరిత, ఏ జీవో కర్ణాకర్ రెడ్డి, వార్డెన్ రాధిక,తర్నికల్ ఎంపీటీసీ పవన్ కుమార్ రెడ్డి, నిజామోద్దీన్, బాల్ రెడ్డి,ఐక్యత ఫౌండేషన్ చంద్ర శేఖర్,శ్రీపతి రాజు,గణేష్,రమేష్ నాయక్,హసన్,జగన్,షఫీ,రమేష్ గౌడ్, శేఖర్,కొండల్,రంజిత్ రెడ్డి,శివకృష్ణ,భాస్కర్,మహేశ్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS