విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్

Spread the love

విద్యార్థులు ఆరోగ్యాంగా ఉండి అవధులు లేని లక్ష్యాలను సాధించాలి: సబితా ఆనంద్ పౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్”

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి సబితా ఆనంద్ ఫౌండేషన్ చైర్ పర్సన్ “డాక్టర్ మెతుకు సబితా ఆనంద్” వికారాబాద్ రిక్షా కాలనీ సమీపంలోని KGBV విద్యాలయం లో, ఈ నెల 18 న చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ….. సబితా ఆనంద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు.

▪️ విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందించి, తగు ఆరోగ్య సూచనలు చేసి 400 మంది విద్యార్థులకు శానిటేషన్ ప్యాడ్స్ పంపిణీ చేశారు.

▪️ విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండి మంచి చదువు చదివి అవధులు లేని లక్ష్యాలను సాధించి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చేలా ఎదగాలన్నారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణ BRS పార్టీ మహిళా అధ్యక్షురాలు,13వ వార్డు కౌన్సిలర్ మేక పావని చంద్రశేఖర్ రెడ్డి,16వ వార్డు కౌన్సిలర్ రాజ్యలక్ష్మి రమణ, 30వ వార్డు కౌన్సిలర్ బోండల సువర్ణ అశోక్, కో ఆప్షన్ సభ్యులు దమయంతి వెంకట్, బూరుగుపల్లి వార్డు మహిళా అధ్యక్షులు జయలత అనంత్ రెడ్డి, వికారాబాద్ మండల BRS పార్టీ మహిళా అధ్యక్షులు కవిత ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page