చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్రాభివృద్ధి: ఉమామహేశ్వర నాయుడు…

Spread the love

ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఇంటికి పంపి అన్ని విధాల దెబ్బతిన్న మన రాష్ట్రానికి అన్ని విధాల ముందుకు తీసుకెళ్లడానికి చంద్రబాబు నాయుడు ని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకుందామని అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని ఎన్టీఆర్ భవన్ లో భవిష్యత్తుకు గ్యారెంటీ పై నిర్వహిస్తున్న బస్సుయాత్రపై నిర్వహించిన సమీక్ష కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు . ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వివరించారు.

వీటన్నింటినీ గ్రామీణ ప్రాంత ప్రజలకు వివరించడంతో పాటు మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రచారం చేసేందుకు తలపెట్టిన బస్సు యాత్రను కలిసికట్టుగా నిర్వహించి విజయవంతం చేద్దామని కోరారు. రాష్ట్రంలోనే కాక కళ్యాణదుర్గం నియోజకవర్గం లో చోటు చేసుకున్న అనేక అవినీతి అక్రమ లను నాయకులకు కార్యకర్తలకు వివరిస్తూ వీటన్నిటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లేందుకు తలపెట్టినందుకు చేపడుతున్న 30 రోజుల బస్సు యాత్ర, 150 రోజుల పాటు నిర్వహిస్తున్న భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామీణ ప్రాంతాలు తిరిగి వివరిద్దామని కోరారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page