జగ్గయ్యపేట ట్రాఫిక్ ఎస్సైగా శ్రీనివాసరావు..

Spread the love

జగ్గయ్యపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి ఎస్సై గా నూతనంగా నియమితులైన ఆర్.శ్రీనివాసరావు నాడు రాష్ట్ర ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా చెరువు బజార్ పర్యటనలో ఉన్న ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఆయనకు అభినందనలు తెలియజేసిన ఉదయభాను మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నియంత్రణకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని తాను గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తూ వచ్చానని ఎట్టకేలకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం హర్షినియమని అన్నారు.

ట్రాఫిక్ అతిగా ఉన్న కుడలి లో నిరంతరం ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటుచేసి వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Related Posts

You cannot copy content of this page