వార్డులో పర్యటించిన శంభీపూర్ క్రిష్ణ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపేట్ 26వ వార్డు కే.వి.అర్ వ్యాలీలో దుండిగల్ పురపాలక కమిషనర్ సత్యనరాయణ తో కలిసి కాలనీలో పర్యటించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీ.అర్.ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలు గుంతలమయంగా మారాయి. వ్యస్తంగా మారిన రోడ్లను పరిశీలించారు. తక్షణమే


చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అవసరమైతేనే ఇంటి నుండి బయటకు రావాలని తెలిపారు. కాలనీలలో ఉన్న విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం లాంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి, ఏఈ ప్రవీణ్ కుమార్, స్ధానికులు, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page