ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

Spread the love

ప్రారంభమైన పోలీసు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

— ప్రక్రియను పరిశీలించిన జిల్లా యస్.పి రాజేంద్ర ప్రసాద్

సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

ఎస్.ఐ, కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు తుది రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు సంబంధించిన ధ్రువ ప్రతాల పరిశీలన సూర్యాపేట జిల్లా కార్యాలయములో బుధవారం ప్రారంభమైనది. నేటి నుండి ఈ నెల 26వ వరకు జిల్లాకు చెందిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలించబడుతాయి. అభ్యర్థులకు కేటాయించిన తేదిల్లో అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ నందు సూచించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావల్సి వుంటుంది. జిల్లా పరిధిలో మొత్తం 5968 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలంచబడుతాయి. ఇందుకోసం మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని. నేటి ధృవ పత్రాల పరిశీలనకు 600 అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 507 మంది హాజరైనారు, ఇందులో అమ్మాయిలు 133 మంది, అబ్బాయిలు 374 మంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ అభ్యర్థుల ధ్రురపత్రాల పరిశీలన ప్రక్రియ పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌక్యరానికి గురికాకుండా అలాగే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ వేగంగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థులు సూచనలు పాటిస్తూ సమయానికి చేరుకోవాలని అన్నారు. ప్రలోబాలకు గురికావోద్దు అన్నారు. పరిశీలన స్థలం వద్ద సిబ్బంది అన్ని విధాల సహాయ సహకారం అందిస్తారు అని అన్నారు. యస్.పి వెంట ఏవో సురేష్ బాబు, డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ నర్సింహ, ఆర్ ఐ లు శ్రీనివాస రావు, గోవిందరావు, శ్రీనివాస్, నర్సింహారావు, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్, రాజ్ కుమార్, డీపివో సిబ్బంది, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page