కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది

Spread the love

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, రామునిపల్లి గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్విరామ కృషి చేస్తున్నారని ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని గత పాలకులు అభివృద్ధిని మరిచి తమ సొంత ప్రయోజనాల కోసం పనిచేశారని ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి మంత్రుల తో పాటు ఎమ్మెల్యేల మందిరం కృషి చేస్తున్నామని రానున్న రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేసి రాష్ట్రాన్ని అద్దం తునకల మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , ఉపాధి హామీ కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

Related Posts

You cannot copy content of this page