ప్రమాణ స్వీకార సభలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత సమీర్ ఖాన్

Spread the love
ఆంధ్రప్రదేశ్ ముస్లిం స్వర్ణకారుల సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార సభలో నెల్లూరు నగరానికి చెందిన వైఎస్ఆర్సిపి నేత సమీర్ ఖాన్ మాట్లాడుతూ స్వర్ణకారుల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న స్థానిక పార్లమెంటు సభ్యులు రూరల్ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సేవలను కొనియాడారు. ఈ దేశంలో ముస్లింలను అత్యధికంగా గౌరవించేది ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని. నెల్లూరు జిల్లాలో ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేది ఆదాల ప్రభాకర్ రెడ్డి అని అన్నారు.
ఈ సందర్భంగా ముస్లిం స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదాల దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కరించే దిశగా సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రూరల్ నియోజకవర్గం లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి తిరుగులేదని ఇక్కడ విజయం సాధించిన తద్యమని, అలాగే ముస్లిం స్వర్ణకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నిక కాబడ్డ ఇస్మాయిల్ ఖాదిరిని అభినందించారు.

Related Posts

You cannot copy content of this page