రూ.3.50 లక్షల విలువ గల LOC లను లబ్దిదారులకు అందచేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

Spread the love

రూ.3.50 లక్షల విలువ గల LOC లను లబ్దిదారులకు అందచేసిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …

…..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కి చెందిన ఎ. కృష్ణ, బి. హరీష్ లు గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా లేక మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆశ్రయించగా ముఖ్యమంత్రి సహాయ నిధి ని మంజూరు చేయించారు. కృష్ణకు రూ.2.50,000 లక్షలు, హరీష్ కు రూ.1,00, 000 లక్షలకు సంబదించిన ఎల్ఓసీలను ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, గోపాల్ రెడ్డి, ఆనంద్ కుమార్, సాయి యాదవ్, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఈ.శ్రీనివాస్, బైండ్ల గోపాల్, దుండిగల్ మున్సిపల్ తెరాస యూత్ ఊపాధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, వినయ్, దార మహేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page