దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. తక్షణమే సీడీపీ నిధుల నుండి రూ.25 లక్షలు మంజూరు…

Spread the love


Request to MLA to work for the development of Dobighat.. Immediate grant of Rs.25 lakhs from CDP funds…

దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి.. తక్షణమే సీడీపీ నిధుల నుండి రూ.25 లక్షలు మంజూరు…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధికి చెందిన జాగృతి రజక సహకార సంఘం సభ్యులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రూ.25 లక్షలు సీడీపీ నిధుల నుండి మంజూరు చేశారు. ఈ మేరకు సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు విఠల్, సత్యనారాయణ, భాస్కర్, నాగరాజు, రాజు, చంద్రమౌళి, సతీష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page