గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి…

Spread the love

Request to MLA to allot land for construction of library building…

గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతి…

సాక్షిత ; మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని ప్రగతి నగర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గ్రంథాలయ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడేలా త్వరలోనే ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి గ్రంథాలయ భవనం కొరకు కేటాయించేలా కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page