అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పై వైసీపీ ఎమ్మెల్యేల దాడిని నిరసిస్తూ నిరసన

Spread the love

సాక్షిత : *ప్రకాశం జిల్లా కంభం
అసెంబ్లీలో టీడీపీ దళిత ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి పై వైసీపీ ఎమ్మెల్యేల దాడిని నిరసిస్తూ నిరసన తెలిపిన కంభం టీడీపీ నాయకులు.


ప్రకాశంజిల్లా కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్ నందు గిద్దలూరు టీడీపీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి అదేశాల మేరకు శాసనసభ లో జి, ఓ no 1 రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చి దానిపై చర్చను అడిగిన టీడీపీ ఎమ్మెల్యేల విన్నపాన్ని పట్టించుకోనందుకు స్పీకర్ పోడియం వద్ద నిరసన చేస్తుంటే వైసీపీ సభ్యులు వచ్చి డోలా బాలవీరాంజనేయ స్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడిచేయటం అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి తోసివేయటం ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తు నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కంభం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని నిరసన తెలియజేశారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page