విజయవాడ లో స్పా సెంటర్ల మాటున వ్యభిచారం

Spread the love

విజయవాడ లో స్పా సెంటర్ల మాటున వ్యభిచారం!..పక్కా ఇన్ఫర్మేషన్ తో మెరుపు దాడులు చేసిన పోలీసులు

విజయవాడలోని మసాజ్‌ సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతో.. పోలీసులు స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు.

అయితే, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఆదేశాల మేరకే ఈ ప్రత్యేక ఆపరేషన్ కొనసాగింది.

ఇక ఈ అపరేషన్ లో ఇసుక, మట్టి, మద్యం అక్రమ తరలింపును అరికట్టేందుకు ఏర్పడిన సెబ్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో సహా.. 62 మంది, 10 బృందాలుగా ఏకకాలంలో విజయవాడ పరిధిలోకి వచ్చే.. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని గల 6 స్పా సెంటర్ల పై ఏక కాలంలో మెరుపు దాడులు చేశారు.

అయితే.. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడంతో పాటు క్రాస్ మసాజ్ ముసుగులో వ్యభిచార కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్టుగా అందిన సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు.

ఈ క్రమంలోనే పటమట, మాచవరం, పెనమలూరు, ఎస్.ఆర్.పేట పరిధిలోని స్పా సెంటర్లపై మూకుమ్మడిగా దాడులు నిర్వహించారు.

ఇక ఈ దాడులలో స్థానిక మహిళలతో పాటు విదేశీ మహిళలతో సైతం వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తం 10 బృందాలతో ఆరు స్పా సెంటర్లపైన జరిపిన దాడులలో థాయిలాండ్‌కు చెందిన ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అయితే ఈ అక్రమ స్పా సెంటర్ల నిర్వహణను నివారించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పోలీసులు అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు.కాగా, ఈ దాడులనేవి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఐజి రవి ప్రకాష్ పర్యవేక్షణలో జరిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page