డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Spread the love

ఈటానగర్‌:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ గ్యారంటీ ఫలితాలు కనిపిస్తున్నాయ‌ న్నారు. బీజేపీ ఘన విజయం సాధించనుందని దీంతో అర్థం అవుతోంద‌ని చెప్పారు.. తాను ఎన్నికల్లో విజయం కోసం పనిచేయన‌ని, ప్రజల కోసమే పనిచేస్తాన‌ని అన్నారు..

70ఏళ్ల‌లో చేయ‌ని అభి వృద్ధిని ప‌దేళ్ల‌లో చేశాను, యూపీఏ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి కుంటు పడింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.. నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాల్లో రూ.55వేల కోట్ల‌ పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంద‌ని చెప్పారు..

70ఏళ్ల యూపీఏ పాలనలో చేయని అభివృద్ధిని తాను పదేళ్లలోనే చేసి చూపించానని ప్ర‌ధాని అన్నారు. అష్టలక్ష్మీ పథకం ద్వారా ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేయడమే త‌న‌ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page