ప్రసూన్న నగర్ సంక్షేమ సంఘం, శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ కమిటీ నూతన పాలకవర్గం సభ్యుల ఎన్నిక..

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద 132-జీడిమెట్ల డివిజన్ ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం కార్యవర్గం సభ్యులు మరియు శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రసూన్న నగర్ కాలనీవాసులు మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను అన్నింటిని మీరు పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ నూతన సంక్షేమ సంఘానికి ముందుగా నా శుభాభినందనలు, రానున్న రోజుల్లో కాలనీ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ప్రసూన్న నగర్ నూతన సంక్షేమ సంఘం: అధ్యక్షులు – రాంచందర్, ప్రధాన కార్యదర్శి – సిద్ధులు గౌడ్, కోశాధికారి – జి.రమేష్, సభ్యులు ఆర్.సుబ్బారావు, కె. నాగేంద్రబాబు తదితరులు…

శ్రీ కోదండ రామాలయం దేవాలయ నూతన పాలకవర్గం: అధ్యక్షులు – జి.సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి – నాగచంద్రారెడ్డి, కోశాధికారి మద్దిలేటి, సభ్యులు సీ.కే.ఆశ, యు. సుజాత, శైలజ, జే. నాగేశ్వర్ రావు తదితరులు…

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page