పటిష్ట బందోబస్త్ నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్

Spread the love

పటిష్ట బందోబస్త్ నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపిఎస్


*సాక్షిత ప్రకాశం జిల్లా : అతి తక్కువ సమయంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ *

కొండపి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు తల్లి కోటమ్మ మరణించిగా రాష్ట్ర ముఖ్యమంత్రి .వైయస్.జగన్ మోహన్ రెడ్డి ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి టంగుటూరు మండలం, కారుమంచికి విచ్చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ని హెలిప్యాడ్ వద్ద ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ మర్యాద పూర్వకంగా కలిశారు.

తదుపరి ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి వరికూటి అశోక్ బాబు తల్లి కోటమ్మ భౌతిక కాయం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి బయలుదేరారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించడమైనదని ఎస్పీ తెలియచేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి, రివార్డ్స్ ప్రకటించారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page