దాడిలో తీవ్ర గాయాల పాలైన మొగిలి శ్రీను ను పరామర్శించిన పొంగులేటి వర్గం నాయకుడు మల్లిబాబు యాదవ్

Spread the love

దాడిలో తీవ్ర గాయాల పాలైన మొగిలి శ్రీను ను పరామర్శించిన పొంగులేటి వర్గం నాయకుడు మల్లిబాబు యాదవ్..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పండితాపురం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం అనంతరం జరిగిన ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులపై దాదాపు 50 మంది దుండగులుఉద్దేశపూర్వకంగా రాళ్లతో దాడి చేయడం వలన ఊరేగింపులో పాల్గొన్న వ్యక్తులకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న మొగిలి శ్రీను ను డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్, జిల్లా మైనారిటీ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ పరామర్శించి, మేమున్నామంటూ భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ, సామరస్యంగా, శాంతియుతంగా జరుగుతున్న శోభాయాత్ర కార్యక్రమంను చూసి ఓర్వలేని కొంతమంది దుండగులు ఊరేగింపు ను చెదరగొట్టాలని, వృద్ధులు మహిళలు అని చూడకుండా రాళ్లతో దాడి చేసి గాయపరచడం వారి దుర్మార్గపు చర్యకు పరాకాష్ట అని దీనిపై పోలీసులు స్పందించి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని, ఎస్టి అట్రాసిటీ యాక్ట్ క్రింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో శాంతియుతంగా ఉండాలని గ్రామ ప్రజల్ని మల్లిబాబు యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో చల్ల నాగరాజు బాధావత్ నాగరాజు, భూక్యా రవి, డేరంగుల తిరపయ్య, తురక బిక్షం తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page