పీజేఆర్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని బిఆర్స్కేవి కార్మిక విభాగం

Spread the love

PJR 15th Anniversary Program by BRSKV Labor Department

సాక్షిత : పీజేఆర్ 15వ వర్ధంతి కార్యక్రమాన్ని బిఆర్స్కేవి కార్మిక విభాగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు కర్క నాగరాజ్ ఆధ్వర్యంలో మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కూకట్పల్లి యంల్ఏ మాధవరం కృష్ణారావు విచ్చేసి పిజెఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల పక్షపతిగా, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ స్వపక్షం అయిన విపక్షం అయిన ప్రభుత్వాలతో అలుపెరుగనిపోరాటం చేసిన ప్రజానాయకుడు పి.జనార్దనరెడ్డి అని వారు పేర్కొన్నారు.అసెంబ్లీలో తెలంగాణా ప్రాంతానికి సంబందించిన సమస్యలను సభ దృష్టికి తెచ్చిన గొప్ప నాయకులు పిజెఆర్ అని పార్టీలకు అతీతంగా పిజెఆర్ ని ఇష్టపడతారని హైదరాబాద్ మహానగరంలో వేలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వం నుండి పట్టాలిపించిన ఘనత పిజెఆర్ దే నని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు సంబందించిన నాయకులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. బాలాజీనగర్ కార్పొరేటర్ శిరీష బాబురావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, మాజీ కార్పొరేటర్ బాబురావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్,బిఆర్ స్ పార్టీ సీనియర్ నాయకులు కర్క పెంటయ్య, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు,అంబటి శ్రీనివాస్ అంబేద్కర్ నగర్ బస్తీ అధ్యక్షులు కర్క డాకయ్య,కర్క స్వామి, జిల్లా గోపాల్, కర్క రవీందర్,

తూము వినయ్ కాంగ్రెస్ నాయకులు జి. మల్లేష్, కర్క నర్సింగ్ రావ్, బిఆర్ యస్ పార్టీ నాయకులు శ్రీహరి, అంజిగౌడ్, సుబ్బారావు,మల్లేష్,కర్రేమ్మ,బొట్టు విష్ణు, శివరాజ్,కార్మిక విభాగం నాయకులు భాశెట్టి నర్సింగరావు,కర్క శివశంకర్,వెంక్కన్న, సురేందర్,రాజు, జి.రమేష్, కృష్ణా, లీడర్ బాబు,సురేష్ బీజేపీ నాయకులు యాదయ్య, మల్లేష్, సాయి అప్పలరాజు,మరియు పార్టీ అన్ని అనుబంధ విభాగల నాయకులు, పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకులు,పీజేఆర్ గారి అభిమానులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Related Posts

You cannot copy content of this page