షాదీఖానా భూమి సర్వేనెంబర్ 629 గురించి RDO కి వినతి పత్రం

Spread the love

Petition to RDO regarding Shadikhana Land Survey No.629

కరీంనగర్ జిల్లా జమ్మికుంట లోని భూ బకాసుర్ల చేతిలో గురైన ముస్లిం మైనార్టీ షాదీఖానా భూమి సర్వేనెంబర్ 629 గురించి RDO కి వినతి పత్రం ఇచ్చిన మైనారిటీ ప్రజలు

గతంలో హుజరాబాద్ డివిజన్ ఉప ఎన్నికల్లో సమయంలో మంత్రి వారు అయినా హరీష్ రావు& కొప్పుల ఈశ్వర్ జమ్మికుంట ముస్లిం మైనార్టీ లకు షాదీ ఖానా భూమి సర్వే నెంబర్ 629 ముస్లింలకు కేటాయించడం జరిగింది ఈ భూమి కబ్జాకు గురైందని ముస్లిం సోదరులు తమ జమ్మికుంట పట్టణం ఎమ్మార్వో గారికి మరియు నగర పంచాయతీ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, తేదీ, 31- 12- 2022, డిసెంబర్ రోజున ఎమ్మార్వో బండి రాజేశ్వరి, తమ వెంట Ri, లు తిరుపతి మరియు సంతోష్, తీసుకొని వచ్చి మైనార్టీలకు కేటాయించిన ముస్లింలకు షాది ఖానా భూమిని విచారణ చేసి ముస్లింలకు మీ యొక్క ముస్లిం షాది ఖానా బోర్డును పెట్టగలరని సూచించారు మరుస టీ నాలుగు రోజుల తర్వాత రాత్రికి రాత్రి ఎవరో వచ్చి ఈ భూమి మాది అని ఫ్లెక్సీ అంటించారు ముస్లిం సోదరులు తమ ఆవేదన ఫోన్ ద్వారా మాట్లాడదామంటే ఎమ్మార్వో మేడం సమాధానం చెప్పలేదు, జమ్మికుంట ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఈరోజు హుజూరాబాద్ ఆర్డిఓ సార్ కు కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో గుల్జర్ మజీద్ సదర్ సాబ్, మొహమ్మద్ మీరు సేన్, ఎంఏ ఫిరోజ్, జానీ, రుస్తుం, పర్వేజ్, సజ్జు, ముఖిద్ అహ్మద్, ఫయాజ్ మహమ్మద్, మౌజన్ సలీం భాయ్, సమీర్, కదిరిమియా, ఉబేదుల్లా, బాబా మియా, జమీర్, సైఫ్, మునీర్, షానవాజ్ మహమ్మద్, తదితరులు జమ్మికుంట ముస్లిం యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page