పండితాపురం లింగమంతుల జాతర

Spread the love

Panditapuram Lingamantula Jatha

పండితాపురం లింగమంతుల జాతర

-మేకల మల్లి బాబు యాదవ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రాత్రి నుండి పండితాపురం లో కొలువైన లింగమంతుల స్వామి జాతరభారీ ఎత్తున జరుగుతుందని, జాతర కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొంటారని, మొక్కులు కూడా తీర్చుకుంటారని, అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు.

మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది పండితాపురంలో సీత బంధం వాగు వద్ద లింగమంతుల జాతర ఘనంగా నిర్వహించబడుతుందని, భారీ ఎత్తున యాదవులు యాదవ సోదరీమణులు బోనాలతో, వాయిద్యాలతో ఊరేగింపుగా జాతరలో పాల్గొంటారని, ప్రతి ఒక్కరూ ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలని మల్లి బాబు యాదవ్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొండాయిగూడెం మత్స్యశాఖ సంఘం అధ్యక్షులు మేకల మల్లికార్జున యాదవ్, చింతల పెద్ద వెంకయ్య, చింతల వెంకటేశ్వర్లు, అరవ లాలుకృష్ణ,అరిపిన్ని అశోక్,మేకల మహేష్ బాబు, యాదవ సంఘం మండల నాయకులు అల్లిక బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page