ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

Spread the love

ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం…

సాక్షిత : కుత్బుల్లాపూర్ లో వైద్య కళాశాల మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ప్రజల తరపున ఎమ్మెల్యే కృతజ్ఞతలు…

ముఖ్యమంత్రి కేసీఆర్ మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశ వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం చరిత్ర సృష్టించనుందని అన్నారు.

విజనరీ లీడర్ కేసీఆర్ ముందుచూపుతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నదని స్పష్టం చేశారు. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాకు సంబంధించిన వైద్య కళాశాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు ప్రజల తరపున సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వైద్య కళాశాల ఏర్పాటుతో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండనుందని అన్నారు. ప్రత్యేక జీవో నెంబర్ 87 ద్వారా 100 ఎంబీబిఎస్ సీట్ల సామర్ధ్యం గల వైద్య కళాశాలను మంజూరు చేసినందుకు ఈ ప్రాంత ప్రజలంతా సీఎం కేసీఆర్ కి ఋణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page